విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో లైగర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైగర్ షూటింగ్తో బిజీగా ఉంది పూరీ-విజయ్ టీం. కాగా ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో సినిమా జన గణ మన ప్రాజెక్టును చేయబోతున్నట్టు ప్రకటించారు పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అమెరికాలో ఈ నెలలో షూటింగ్ మొదలుకానుంది. లైగర్ (Liger)సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం పూర్తి కానుందట.
ఇప్పటివరకున్న అప్ డేట్ ప్రకారం తాజా ప్రాజెక్టులో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎందరో స్టార్ హీరోలకు పనిచేసిన ఏఆర్ రెహమాన్ తో విజయ్ దేవర కొండ సినిమా ఉండబోతుందన్న అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.