అర్జున్ రెడ్డి సినిమాతో తన క్రేజ్ మరింతగా పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. లైగర్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో అలరించింది. అభిమానులు అయితే విజయ్ దేవరకొండ పోస్టర్కు పాలాభిషేకాలు, బీరాభిషేకాలు చేయడమే కాకుండా కేక్ కూడా కట్ చేసి నానా రచ్చ చేశారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బడా హిట్ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, విజయ్ దేవరకొండ- అనన్య పాండేపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. అయితే షూటింగ్ లేని సమయంలో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ బాలీవుడ్ స్టార్స్తో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్తో కలిసి లైగర్ టీం సందడి చేయగా, ఆ పిక్స్ వైరల్గా మారాయి.