న్యూఢిల్లీ: అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురి మృతదేహాలను కాలిఫోర్నియాలోని ఓ తోటలో గుర్తించారు. ఇక కిడ్నాప్ అయిన సమయంలో జరిగిన సంఘటనకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఓ బిజినెస్ సెంటర్ నుంచి కిడ్నాపర్ నలుగుర్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. తొలుత ఇద్దరు వ్యక్తుల చేతుల్ని కట్టేసి ఓ ట్రక్కు వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత 8 నెలల చిన్నారిని, ఆమె తల్లిని కూడా కిడ్నాపర్ తన ట్రక్కు వద్దకు తీసుకెళ్లాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో నిక్షిప్తమైంది. దానికి సంబంధించిన వీడియోను ఓ ఛానల్లో ప్రసారం చేశారు. కిడ్నాప్ అయిన ఆరూహి దేరి, జస్లీన్ కౌర్, జస్దీప్ సింగ్, అమన్దీప్ సింగ్ మృతదేహాలు దొరికాయి. ఆ కిడ్నాప్కు చెందిన వీడియో ఇదే.