హైదరాబాద్ : దేశ ప్రజలకు భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయకుడు ఆదివారం హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ హోలీని జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యమత్యంగా జరుపుకునే హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగుల కాంతిని నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రంగుల హోలీ ప్రజల జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని అన్నారు.