యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ గోదా అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా వేద పండితులు కల్యాణ తంతు నిర్వహించారు. కల్యాణ వేడుకకు ముందు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను ఇంటర్ సిటీ అధినేత సోలిపురం వెంకట్రెడ్డి దంపతులు స్వామి వారికి సమర్పించారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి