తిరుపతి,జూన్ 17:భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రి-కామర్స్ కంపెనీ వేకూల్ ఫుడ్స్ కు చెందిన డెయిరీ బ్రాండ్ శుద్ద తన రెండవ డెయిరీ రిటైల్ స్టోర్, శుద్ధ స్క్వేర్ను తిరుపతిలోప్రారంభించినట్టు ప్రకటించింది. జిల్లాలో ఇది మూడవ స్టోర్, ఇటీవలే తన శుద్ధ స్క్వేర్ స్టోర్ను చిత్తూరులో శుద్ధ ప్రారంభించింది. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి నాణ్యత,రుచులను అందించడంలో ప్రసిద్ధి చెందిన శుద్ధ తమ పాలను తాజాదనం,స్వచ్ఛతలకు హామీ ఇచ్చేందుకు కఠినమైన నాణ్యతా తనిఖీ చర్యలు చేపట్టి, రోజువారీ ప్రాతిపదికన స్థానిక రైతుల నుంచి సేకరిస్తుంది.
జీవకోనలో ప్రారంభించిన ఈ స్టోర్ తాజా పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, లస్సీ & కోవా లాంటి డెయిరీ ఉత్పత్తులను అందిస్తుంది.“తిరుపతిలో మా రెండవ శుద్ధా స్క్రేర్ ప్రారంభిస్తున్నామని ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా మొదటి స్టోర్ ద్వారా అందుకున్న స్పందన, జీవకొండలో మా ద్వారాలు తెరిచేలా మమ్మల్ని ప్రోత్సహించింది. తిరుపతిలో ఈ నెలలోనే మా మూడవ శుద్ధ స్టోర్ ఏర్పాటు చేయడానికీ, మా ఉత్పత్తుల శ్రేణిలో ఐస్ క్రీమ్, ఫ్లేవర్డ్ మిల్క్, గేదె పాలు తదితర ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని వేకూల్ ఫుడ్స్ హెడ్ ఆఫ్ డెయిరీ, దేబాశిష్ సమాల్ అన్నారు.