న్యూఢిల్లీ: రోహిణి కార్తెలో రోళ్లు పగుల్తాయ్… అనే సామెత పాతకాలం నాటిది.. ఇప్పుడు రోడ్లే కాదూ వాహనాలూ మండిపోతాయ్ అన్నది కొత్త సామెత.. ఎందుకంటే ఇప్పుడే మొదలైన వేసవి కాలంలో అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు.. మిట్ట మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చిన వారు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.. అంతే కాదు.. రోడ్లతోపాటు వాటిపై వెళ్లే వాహనాలు మండుతున్నాయిప్పుడు. నడి రోడ్డు మీదే భగ్గుమని మండిపోతున్నాయి.. కనుక టూ వీలర్స్.. ప్రత్యేకించి కార్ల యజమానులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు నడిపే వాహనాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి.. ఇంజిన్ను కూల్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చడంతోపాటు వాహనాల్లో కూలింగ్ వసతులు సరిగ్గా పని చేస్తున్నాయో తెలుసుకుంటూ ఉండాలి.
టైర్లలో సరిపడా గాలి ఉందో? లేదో? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.. గాలి తక్కువైనా.. టైర్లు అరిగిపోయినా ఎండ వేడికి అవి ఫట్మని పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటితే.. ఇక ముందు కొత్త రికార్డులు నమోదయ్యే ప్రమాదమే ఎక్కువగా పొంచి ఉంది.
గత నెల రోజుల్లోనే దాదాపు 10 వాహనాలు దగ్ధమయ్యాయని అగ్నిమాపక దళ సిబ్బంది చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసి, అక్కడికి వెళ్లే లోపే అగ్నికి వాహనాలు ఆహుతయ్యాయని అగ్నిమాపక దళ అధికారుల కథనం. కనుక కార్లలో, మోటారు బైక్లపై ప్రయాణించే వారు అప్రమత్తంగా లేకుంటే వారి ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని అగ్నిమాపక దళ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కనుక విపత్కర పరిస్థితులు ఏర్పడకముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. కనుక ఎండ ప్రారంభానికి ముందే సర్వీసింగ్ చేయించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు.
కారు ప్రయాణ సమయంలో దాని ఇంజిన్లో 170 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. బయట 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డై ఉంటుంది. కనుక ఇంజిన్లో కూలెంట్ లిక్విడ్, ఇంజిన్ ఆయిల్ త్వరితగతిన ఆవిరవుతాయి. లిక్విడ్లు ఆవిరైతే ఇంజిన్ వేడెక్కుతుంది.
కనుక కార్ల అద్దాలను క్లీన్ చేసే వైఫర్ ఫ్లూయిడ్స్, ఏసీలో క్లోరో ఫ్లోరో కార్బన్ స్థాయిలను తరుచుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేడి వల్ల ఇంజిన్లోని వైరింగ్, ప్లాస్టిక్ పరికరాలు కరిగిపోయే ముప్పు ఉంది.
ఒక్కోసారి ఇంజిన్ ఆయిల్ లీకైనా ప్రమాదం సంభవిస్తుంది. ఎక్కువగా సైలెన్సర్ నుంచి వేడి వస్తుంది కనుక.. ఆయిల్ లీకైతే సైలెన్సర్ నుంచి బయటకు వస్తుంది.. అటువంటప్పుడు ప్రమాదాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వాహనాల వినియోగదారులు ప్రతి 10 వేల కిలోమీటర్లు దాటగానే సర్వీసింగ్ చేయించుకోవడంతోపాటు సాధ్యమైనంత వరకు ఎండలో వాహనం నిలుపొద్దు. మైలేజీ తగ్గినట్లు కనిపిస్తే లీకేజీలు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకుని సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ టైంలో అన్ని రకాల లిక్విడ్ స్థాయిలను చెక్ చేశారో, లేదో తెలుసుకోవాలి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో