హైదరాబాద్, మే 31: తమ ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు భరోసానందిస్తూ వేదాంత ఇప్పుడు దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. తద్వారా తమ ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములకు టీకాలను అందించనున్నారు.ఈ కంపెనీ 50వేల మోతాదుల టీకాలను అందుకోవడంతో పాటుగా వాటిని ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు పలు యూనిట్ల వద్ద వేయడం జరిగింది. వేదాంత ఇప్పుడు అదనంగా మరో 2 లక్షల టీకా మోతాదులను సమీకరించుకోవడంతో పాటుగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1.2 లక్షల మందికి టీకాలను వేయనున్నారు.
వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ వేదాంతలో ప్రతి ఉద్యోగి భద్రత, శ్రేయస్సుతో పాటుగా వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కూడా తాము అమిత ప్రాధాన్యతనిస్తుంటాం. మా టీకా కార్యక్రమం ద్వారా 100% ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు టీకా వేశామనే భరోసాఅందించాలనుకుంటున్నాం. దేశంలో జరుగుతున్న టీకా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.