హైదరాబాద్ :పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె. సీతారామ రావు మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ దూర విద్య విధానం, తెలంగాణ రాష్ట్రంలో దూర విద్యా వ్యాప్తి కోసం పంచాయతీ రాజ్ శాఖ సహకారం అవసరం ఉందని మంత్రిని కోరారు.
పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్లో డిగ్రీ పూర్తి చేయని వారికి, పీజీ లాంటి కోర్సులు పూర్తి చేయాలి అనుకునే వారికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దూర విద్య విధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం