Srisailam | శ్రీశైలంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసవీ కన్యకాపరమేశ్వరీ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంగతి శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఐత మార్కండేయ తెలిపారు.
ఆదివారం మూలా నక్షత్రం సందర్బంగా సత్ర సముదాయంలోని వాసవీ ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.అదే విధంగా క్షేత్ర పరిధిలోని చిన్నారులతో సరస్వతీ అష్టోత్తరశతనామావళి, లలితా సహస్త్రనామార్చన, కుంకుమార్చనలు చేయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవకి వెంకటనర్సయ్య నాగలక్ష్మి, ప్రసన్న, కళ్యాణ్, రవి, మల్లికార్జున, సాయి, ఆంజనేయులు, సుధారాణి, లక్ష్మి, మీనాక్షి, మోహన్కృష్ణ, కారంశివ తదితరులు పాల్గొన్నారు.