న్యూఢిల్లీ, ఆగస్టు 10: జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామనటం కంటే సిగ్గుచేటు మరొకటి లేదని కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ ఎంపీ వరుణ్గాంధీ మండిపడ్డారు. హర్యానాలోని కొన్ని చోట్ల రేషన్ కోసం వెళ్లిన పేదల నుంచి జాతీయ జెండా కోసం రూ.20 వసూలు చేస్తున్న వీడియోను బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు ఇంత భారంగా మారటం దురదృష్టకరమని అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో త్రివర్ణ పతాకం ఉంటుందని, కానీ, జాతీయ జెండా కొనకపోతే రేషన్ ఇవ్వబోమని అనటం దారుణమని వ్యాఖ్యానించారు. రేషన్ కార్డుదారులు బలవంతంగా జాతీయ జెండాను కొనాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.