(Vanjangi Hills) విశాఖపట్నం: భూతల స్వర్గంగా చెప్పుకునే పాడేరు మన్యంలోని వంజంగి హిల్స్కు పర్యాటకులు భారీగా పోటెత్తారు. పండగల సీజన్ కావడం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి హిల్స్ కిటకిటలాడుతున్నది. అయితే, పర్యాటకులు ఎవరికి వారు వాహనాల్లో తరలివచ్చారు. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడి ఇబ్బందులకు గురిచేస్తున్నది.
మరో ప్రాంతంలో టూరిస్ట్ బస్ వెనుక చక్రం బురదలో ఇరుక్కుపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో పర్యాటకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మేఘాల కొండపైకి వెళ్లేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో పర్యాటకులు తమ వాహనాల్లో రోడ్డుపైనే ఉండిపోయారు. ఉదయం వేళ చలి తీవ్రంగా ఉండటంతో చాలా మంది రోడ్డుపైనే చలిమంటలు వేసుకోవడం కనిపించింది.
వంజంగి కొండ కింద టోల్ రుసుము వసూలు చేస్తున్నారు. అయితే, ఎన్ని వాహనాలను కొండపైకి పంపాలనే నిబంధనలు ఏవీ లేకపోవడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు మేఘాల కొండకు బయల్దేరి ట్రాఫిక్లో ఇరుక్కున్నాయి. ప్రభుత్వం తగు రీతిన స్పందించి పోలీసులను నియమించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేలా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..