మణినగర్: వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్లోని గాంధీనగర్కు వెళ్తున్న రైలు బర్రెల మందను ఢీకొన్నది. ఇవాళ ఉదయం 11.15 నిమిషాలకు వత్వా స్టేషన్ నుంచి మణినగర్ మధ్య ఉన్న రైల్వేలైన్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం వల్ల ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైనట్లు పశ్చిమ రైల్వే సీనియర్ పీఆర్వో జేకే జయంత్ తెలిపారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ప్రారంభించారు. ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ.. గాంధీ నగర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేషన్(అహ్మదాబాద్) వరకు ప్రయాణించారు. ఈ ఎక్స్ప్రెస్ గాంధీ నగర్ – ముంబై మధ్య సేవలను అందిస్తోంది.
ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవచ్ (Kavach) టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్పై వస్తే, వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి, రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది.
DJ శివ కరీంనగర్ 😀😀 pic.twitter.com/wf7y6cmTBo
— Tirumandas Naresh Goud (@GoudNareshBrs) October 6, 2022