హైదరాబాద్ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA)లో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని, సుమారు వెయ్యి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్కుమార్, ఎస్ఐబీ ఎస్పీ భాస్కరన్, ఇంటెలిజెన్స్ ఎస్పీలు డీ జానకి, సీహెచ్ శ్రీధర్, భాస్కర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీలు ఎస్ శ్రీనివాస్, ఎన్వీ కిషన్ రావు, రాజేశ్, ఏఎస్పీ కిరణ్ రాయ్తో పాటు 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.