న్యూఢిల్లీ: ఇప్పటివరకు చిన్నారులకు కరోనా పెద్దఎత్తున సోకిన దాఖలాలు లేవు. అసలు పిల్లకు రాదనే అన్నారు మొదట్లో. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్తరకం లక్షణాలతో పిలలకు కరోనా వస్తున్నదని బయటపడుతున్నది.
థర్డ్ వేవ్ లో కరోనా చిన్నారులపై పంజా విసురుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, చిన్నారులకు టీకా అందించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ను.. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారిపై పరీక్షించనున్నారు. రెండో, మూడో దశ ప్రయోగ పరీక్షల్లో వారిపై కొవాగ్జిన్ను
ప్రయోగించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దాదాపు 525 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగనున్నాయి.