వాషింగ్టన్: కరోనా దృష్ట్యా భారత్ సహా పలు దేశాలపై గతంలో విధించిన ప్రయాణ ఆంక్షలను వచ్చే నెల 8 నుంచి ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కరోనా టీకా వేయించుకుని ఉంటే తమ దేశానికి రావచ్చని శ్వేతసౌధం తెలిపింది. అయితే వారు ప్రయాణానికి ముందు కరోనా పరీక్ష చేయించుకుని, ‘నెగెటివ్ రిపోర్ట్’ను చూపించాల్సి ఉంటుంది. అమెరికా రావాలంటే వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలన్న నిబంధన నుంచి 18 ఏండ్లలోపు వారికి మినహాయింపు ఇచ్చింది.