లక్నో : ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ 15 నుంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది.
రాష్ట్రంలోని 75 జిల్లాలో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 15న, రెండో విడత పోలింగ్ 19న, మూడో విడత పోలింగ్ 26న, నాలుగో విడత పోలింగ్ 29న జరుగుతుందని ఈసీ వెల్లడించింది.
మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో శుక్రవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.