ఢిల్లీ ,జూన్ 4: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19టీకాల విషయంలో యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ వ్యూహంలో భాగంగా, భారతదేశంతో సహా ఇతర దేశాలకు అందుబాటు లోకి తెచ్చేందుకు యుఎస్ దగ్గరున్న ప్రణాళికలను గురించి ప్రధాన మంత్రితో కమలా హ్యారిస్ ఈ సందర్భంగా చర్చించారు.
యుఎస్ తీసుకొన్న నిర్ణయానికి, అలాగే యుఎస్ ప్రభుత్వం వైపు నుంచి, వ్యాపారాల నుంచి, యుఎస్ లోని నిర్వాసితుల నుంచి ఇటీవలి కాలం లో భారతదేశానికి అందించిన సహకారానికి హ్యారిస్ కు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా టీకా తయారీ రంగం సహా, యుఎస్ కు, భారతదేశానికి మధ్య సంబంధాలు బలపరచే దిశ లో ప్రస్తుతం సాగుతున్న ప్రయాసల ను గురించి వీరిద్దరూ చర్చించారు. భారతదేశం- అమెరికా భాగస్వామ్యానికి గల సామర్థ్యాన్ని, దీనితో పాటు మహమ్మారి తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధిత ప్రభావాన్ని పరిష్కరించడం లో క్వాడ్ తాలూకు టీకా కార్యక్రమాన్ని గురించి కూడా ప్రస్తావించారు.