న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ జూనియర్ స్కాష్ టైటిల్ను భారత వర్ధమాన స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. పెన్సిల్వేనియా వేదికగా బుధ వారం జరిగిన అండర్-15 బాలికల విభాగం ఫైనల్లో ఢిల్లీకి చెందిన యువ ప్లేయర్ అనాహత్ 11-9, 11-5, 8-11, 11-5తో జైదా మారే (ఈజిప్ట్)పై అలవోక విజయం సాధించి టైటిల్ను పట్టేసింది. మొదటి రెండు గేమ్ల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఈ యువ సంచలనం మూడో గేమ్లో మాత్రం వెనుకబడింది. అనంతరం పుంజుకుని ఆఖరి రౌండ్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన 13 ఏండ్ల అనాహత్ టైటిల్ విజేతగా నిలిచింది.