న్యూయార్క్: ఉక్రెయిన్పై సోమవారం రష్యా క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ దాడులను అమెరికా ఖండించింది. నాన్ మిలిటరీ కేంద్రాలను ఆ క్షిపణులతో టార్గెట్ చేశారని అమెరికా ఆరోపించింది. దాదాపు 75కుపైగా మిస్సైళ్లను రష్యా వదిలిన విషయం తెలిసిందే. అవి కీవ్లోని యూనివర్సిటీ, పిల్లల ప్లే గ్రౌండ్లలోనూ పడ్డాయి. క్షిపణి దాడుల పట్ల ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ షాక్ వ్యక్తం చేశారు. క్రిమియా బ్రిడ్జ్ను పేల్చివేసినందుకే ప్రతీకారంగా మిస్సైల్ దాడులు చేసినట్లు పుతిన్ ప్రకటించారు. మొత్తం 83 మిస్సైళ్లను రష్యా ప్రయోగించిన ఉక్రెయిన్ చెప్పింది. దాంట్లో 43 క్షిపణులను కూల్చామని కూడా ఆ దేశం వెల్లడించింది.