కాబూల్: అఫ్ఘనిస్తాన్ నుంచి ఆమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మే 1 వ తేదీ నుంచి తన సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలుస్తున్నది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన ప్రకారమే యూఎస్, నాటో దళాలను ఉపసంహరించుకోవడం శనివారం అధికారికంగా ప్రారంభించారు. అయితే, అమెరికా బలగాలు వెనక్కి వెళ్లే సమయంలో కూడా అఫ్ఘాన్లో హింస తగ్గడం లేదు. తాజాగా లోగర్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు కారు బాంబును పేల్చిన ఘటనలో 30 మంది మరణించారు.
అఫ్ఘనిస్తాన్ నుంచి మే 1 నుంచి వైదొలగాలని గతంలో తాలిబాన్లతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. మొత్తం సైన్యాన్ని సెప్టెంబర్ 11 నాటికి ఉపసంహరించుకోవడం ఈ ఒప్పందంలో భాగం. దాదాపు రెండున్నర వేలకు పైగా అమెరికన్, ఏడు వేల నాటో దేశాల దళాలను ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో మోహరించాయి. అమెరికా సైన్యం ఇండ్లకు వెళ్లిపోతున్న తరుణంలో తమకు సంబంధించిన వస్తువులను లెక్కించి.. కొన్ని వస్తువులు, ఆయుధాల జాబితాలను ఆఫ్ఘన్ సైన్యానికి అప్పగిస్తున్నారు. కొన్ని వస్తువులు ఆఫ్ఘనిస్తాన్ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. అమెరికాకు రవాణా చేయవలసిన పరికరాలను సీ -17 కార్గో విమానాలలో లోడ్ చేస్తున్నారు.
అమెరికా సైనిక దళాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో మధ్య ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గలేదు. తూర్పు లోగర్ ప్రావిన్స్లోని కార్ బాంబును ఉగ్రవాదులు పేల్చారు. ఈ ఆత్మాహుతి దాడిలో దాదాపు 70 మంది గాయపడగా.. 30 మంది పౌరులు మరణించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల్లో యూనివర్శిటీ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు ఉండటం విషాదం.
విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులకు ప్రయాణ పరిమితుల నుంచి మినహాయింపు
కరోనా వ్యాప్తి వేళ టెలిమెడిసిన్ సేవలు.. ఎలా పొందొచ్చంటే..?
గవర్నర్తో మిథున్ చక్రవర్తి భేటీ.. రాష్ట్రమంతటా చర్చ
భారత్ బయట కోవిషీల్డ్ ఉత్పత్తికి సీరం సంస్థ యోచన
ఎస్బీఐ ఖాతాదారులకు ఉపశమనం: కేవైసీ అందించేందుకు బ్రాంచీలకు రమ్మనొద్దు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఎలోన్ మస్క్తో నాసా ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు పేలుడు.. 30 మంది దుర్మరణం
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
మే డే వర్ధిల్లాలి.. చరిత్రలో ఈరోజు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..