న్యూఢిల్లీ: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 26 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 53
ఇందులో ఐఈఎస్ 24, ఐఎస్ఎస్ 29 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఐఈఎస్ పోస్టులకు ఎకనమిక్స్, అప్లయిడ్ ఎకనమిక్స్, బిజినెస్ ఎకనమిక్స్, ఎకట్రామిక్స్లో పీజీ చేసి ఉండాలి. ఐఎస్ఎస్ పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్లో డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, వైవా ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 26
పరీక్ష తేదీ: జూన్ 24-26
వెబ్సైట్: www.upsconline.nic.in