న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త మొబైల్ అప్లికేషన్ను గురువారం ప్రారంభించింది. తమ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో ఈ విషయాన్ని వెల్లడించింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫారాలను నింపడానికి ఈ యాప్ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.