UPI Transactions | దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్నాయి. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి నుంచి డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. పది రూపాయల నుంచి వేలల్లో యూపీఐ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. ఆగస్టులో రూ.10.73లక్షల కోట్ల లావాదేవీలు జరగ్గా.. సెప్టెంబర్ నాటికి మూడుశాతం పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శనివారం పేర్కొంది. సెప్టెంబర్లో 6.78 యూపీఐ ట్రాన్సక్షన్స్ జరగ్గా.. రూ.11.16లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని చెప్పింది. జూలైలో భారత్లో 6.28 బిలియన్ ట్రాన్సక్షన్స్ జరిగితే.. రూ.10.62 లావాదేవీలు జరిగినట్లు చెప్పింది.
ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం యూపీఐ సేవలను వినియోగిస్తున్నట్లు ఎన్సీపీఐ పేర్కొంది. ఉపయోగించేందుకు సులభంగా ఉండడంతో పాటు వేగవంతంగా, సురక్షితమైన చెల్లింపు పద్ధతి కారణంగా పేమెంట్స్ పెరుగుతున్నాయని తెలిపింది. అలాగే ఐఎంపీఎస్ ద్వారా ఇంటర్ బ్యాంక్ చెల్లింపులు సెప్టెంబర్లో 46.27 కోట్లు జరిగాయని, అంతకు ముందు నెలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయని, ఆగస్టులో 46.69 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. జూలైలో 46.03 కోట్లుగా ఉన్నాయని ఎన్పీసీఐ పేర్కొంది. ఆధారిత (AePS) లావాదేవీలు సెప్టెంబర్లో 102.66 మిలియన్లుగా నమోదయ్యాయని, అంతకు ముందు నెలలో 105.65 మిలియన్లు, జూలైలో, 110.48 మిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించింది.