న్యూఢిల్లీ, జూలై 1: యూపీఐ ఆధారిత లావాదేవీలు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వరుసగా రెండో నెలా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెల జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (భీమ్ యూపీఐ) కింద రూ.10 లక్షల కోట్లపైనే డిజిటల్ లావాదేవీలు జరిగాయని శుక్రవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
మే నెలలోనూ రూ.10 లక్షల కోట్లకుపైగా యూపీఐ ట్రాన్జాక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నాటితో పోల్చితే గత నెల 2.6 శాతం తగ్గుముఖం పట్టాయి. జూన్లో రూ.10,14,384 కోట్ల విలువైన లావాదేవీలు నమోదవగా, మేలో రూ.10,41,506 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇక జూన్ లావాదేవీల సంఖ్య 5.86 బిలియన్లుగా ఉంటే, మేలో 5.95 బిలియన్లుగా ఉన్నాయి. ఏప్రిల్లో యూపీఐ లావాదేవీల విలువ రూ.9,83,302 కోట్లుగా ఉన్నది. 5.58 బిలియన్ల లావాదేవీలు జరిగాయి.