భారత్లో అభివృద్ధి చేసిన ఆన్లైన్ పేమెంట్ విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) మరో అడుగు ముందుకేసింది. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తయారు చేసింది. దీని సబ్సిడరీ అయిన ఎన్సీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్.. అంతర్జాతీయ స్థాయిలో యూపీఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ పేఎక్స్పర్ట్తో ఒప్పందం చేసుకుంది.
దీంతో ఇక నుంచి యూకేలో కూడా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చట. ఈ విషయాన్ని ఎన్పీసీఐ తాజాగా వెల్లడించింది. ‘ఈ ఒప్పందంతో యూకేలోని అన్ని పేఎక్స్పర్ట్ ఆండ్రాయిడ్ పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) డివైజుల్లో భారతీయ పేమెంట్లు కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. ముందుగా యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తాయి.
నెమ్మదిగా రూపే కార్డు పేమెంట్లను కూడా యూకేలో అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ఎన్పీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏటా సుమారు 5 లక్షల మంది భారతీయులు యూకే వెళ్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. వీరందరికీ ఈ భాగస్వామ్యం వల్ల లబ్ది చేకూరుతుందని ఎన్పీసీఐ తెలిపింది.