మహిళల భద్రతా చర్యలు బాగున్నాయని ప్రశంస
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రతకు తెలంగాణ పోలీసులు చేపడుతున్న చర్యలను ఐక్యరాజ్యసమితి బృందం ప్రశంసించింది. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విభాగం ఏర్పాటుతోపాటు షీటీమ్స్, భరోసా కేంద్రాలు, ఛైల్డ్ఫ్రెండ్లీ కోర్టుల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సేఫ్టీ అండ్ సెక్యురిటీ విభాగం తరఫున డిప్యూటీ సెక్యూరిటీ అడ్వైజర్ విక్టర్ కోబిన్ (భారత్, భూటాన్), జాతీయ సెక్యురిటీ అధికారి దీపాంజలి భక్షి సహా ఐదుగురు సభ్యుల బృందం బుధవారం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కార్యాలయాన్ని సందర్శించినట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా వెల్లడించారు. శాంతిభద్రతలతోపాటు మహిళలు, చి న్నారుల రక్షణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సం స్కరణలను ఐరాస బృందం ఎంతో ఆసక్తితో తెలుసుకొని తెలంగాణ పోలీసుల చర్యలను మెచ్చుకున్నదని వివరించారు. అనంతరం బృందంలోని సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలతో స్వయంగా మాట్లా డి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు స్వాతిలక్రా తెలిపారు.