హైదరాబాద్, జూన్ 24: ఒకప్పుడు హైదరాబాద్ ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గర ‘పేపర్ వెయిట్’లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉండేది. అంతే కాదు,బ్రిటిష్ వారినుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్ను తన బూట్ల లోపల దాచిపెట్టేవారట.. దీనిపేరు జాకబ్ డైమండ్…
ప్రస్తుతం ఈ డైమండ్తో పాటు నిజాం నగలను ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనలో నిజాంనవాబులు వాడిన వజ్రాలు,బంగారు ఆభరణాలు,ఉంగరాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచిన నగలు ఒకప్పుడు నిజాంనవాబులు సేకరించారు. ప్రస్తుతం ఇవన్నీభారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. నిజాం ట్రస్టుల ఆధీనంలో ఉన్నఈ ఆభరణాలనుకేంద్రప్రభుత్వం చట్టపోరాటం ద్వారా సేకరించింది.184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ డైమండ్ విలువ రూ.900 కోట్లు.
జాకబ్ డైమండ్కు ఆ పేరెలా వచ్చిందంటే..?
జాకబ్ అనే వ్యక్తి పేరు మీద ఈ వజ్రానికి ఆ పేరు వచ్చింది. ఆరో నిజాం దీన్ని కొనుగోలు చేశారు. కోర్టు వివాదాలతో విసిగిపోయిన ఆయన,దీన్ని తన టేబుల్ డ్రాయిర్లో పెట్టారు. ఏడో నిజాంకు ఈ వజ్రం పాత చెప్పుల మధ్యదొరికింది.ఆయనఈవజ్రాన్నిపేపర్వెయిట్గాఉపయోగించుకున్నారు.