హైదరాబాద్ : అధిక సంఖ్యలో విద్యార్థుల వ్యక్తిగత హాజరుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురువారం అనుమతి తెలిపింది. విద్యా సంవత్సర కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటికే హాజరు అవుతున్నవారితో పాటు మరో 2 వేల మంది విద్యార్థుల హాజరుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు ప్రొ.వినోద్ పవరాలా నేతృత్వంలోని కమిటీ నివేదికకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు ఆమోదం తెలిపారు. వర్సిటీకి హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల నుండి విచ్చేసే విద్యార్థులు తరగతులకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా ఏడు రోజులు ఐసోలేషన్లో ఉండాలంది.