న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొవిడ్-19 టీకా రెండో డోసును తీసుకున్నారు. గురువారం న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహమ్మారికి భయపడాలని, టీకాకు కాదన్నారు. కొవిన్ వెబ్పోర్ట్లో టీకా తీసుకునేందుకు పేర్లు నమోదు చేసుకొని, వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మార్చి 6న మొదటి డోసు తీసుకున్నారు. భారతదేశంలో కొవిడ్ టీకా పంపిణీ సరికొత్త మైలు రాయిని చేరింది. ఇప్పటి వరకు 9 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.