రాష్ట్రపతికి ఎస్కేఎం లేఖ.. నేడు దేశవ్యాప్త నిరసనలు
నోయిడా, అక్టోబర్ 25: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం లేఖ రాసింది. మరోవైపు, మిశ్రాను బర్తరఫ్ చేయాలని కోరుతూ మంగళవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామని కూడా ఎస్కేఎం తెలిపింది. యూపీలోని లఖింపూర్ ఖీరీలో రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నిందితుడు. అతనితో పాటు పది మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.