న్యూఢిల్లీ: ఇప్పటి వరకు కోటి ప్రికాషన్ డోసులు ఇచ్చినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గడిచిన 19 రోజుల్లోనే అర్హులైన వారికి కోటి బూస్టర్ డోసులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్లైన్ వర్కర్లకు, వ్యాధిగ్రస్తులకు ప్రికాషన్ డోసులు ఇస్తున్న విషయం తెలిసిందే.