Alert to Mobile Users | దేశంలో కోట్లాది మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ల కారణంగా పనులు చాలా సులభమయ్యాయి. స్మార్ట్ఫోన్ రోజువారీ జీవితంలో కీలకంగా మారింది. ఏ కొంత సమయం దొరికినా చాలా మంది ఫోన్లలోనే గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో యూజర్లు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెకాల్నజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక సూచనలు చేసింది.
స్మార్ట్ఫోన్లలో యాప్స్ను తప్పనిసరిగా గూగుల్ ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది. ఇలా చేయడం ద్వారా స్పైవేర్, వైరస్ల బారినపడకుండా కాపాడుకోవచ్చనిచ చెప్పింది. అలాగే యాప్కు సంబంధించిన వివరాలు, యూజర్ రివ్యూలు, డౌన్లోడ్స్ సంఖ్యపై సైతం దృష్టి పెట్టాలని చెప్పింది. స్మార్ట్ఫోన్లలో అనధికారిక వెబ్సైట్లను బ్రౌజ్ చేయొద్దని సూచించింది. అలాగే అనవసరమైన ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్ల్లోని లింక్స్పై క్లిక్ చేయొద్దని చెప్పింది. వెబ్సైట్ డొమైన్ను స్పష్టంగా చూపించే యూఆర్ఎల్స్పైనే క్లిక్ చేయాలని, ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పింది. మొబెల్స్లో సెక్యూరిటీకి సంబంధించిన కొత్త ప్యాచ్లు వస్తాయని, వాటిని అప్డేట్ చేస్తుండడం ద్వారా స్మార్ట్ఫోన్ను వైరస్ల బారినపడకుండా భద్రతనిస్తాయని వివరించింది.