లక్నో : మైనర్పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలోని రిగౌలి జైలులో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ ఖైదీ సంతోష్ శుక్లా(50) గురువారం రాత్రి స్క్రాఫ్తో బ్యారెక్ టాయిలెట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని జైలు అధికారులు శుక్రవారం తెలిపినట్లు జిల్లా ఎస్పీ అంకిత్ మిట్టల్ వెల్లడించారు. మౌ పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని చిబోన్ గ్రామ నివాసియైన శుక్లా గత నెలలో మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ జైలులో ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.