అమరావతి : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై మామ, అల్లుడు మృతి చెందారు. జిల్లాలోని రావులపాలెంలో మామ, అల్లుడు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్కు గురయ్యారు. దీంతో ఈ ప్రమాదంలో మామ ఆర్లప్ప(50), అల్లుడు వెంకట రమణ(35) ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మృతులు మన్యం జిల్లా పాపటపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.