సూర్యాపేట : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాలో పట్టభద్రుల టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సూర్యాపేట నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడుపుతున్న మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు తామంతా పల్లాకు ఓటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
మా తండాలు పంచాయతీలు అయ్యాయి. పుష్కలంగా నీళ్లు, నిధులు వస్తున్నాయి. గ్రామాలు పచ్చగా నిగనిగలాడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అన్ని అమలు చేస్తున్నట్టే భృతి కూడా ఇస్తుందని పలువురు నిరుద్యోగ పట్టభద్రులు చెబుతున్నారు. అందుకే టీఆర్ఎస్కే ఓటు వేస్తామంటున్నారు. ఇదే మండలం రోళ్లబండ తండా, ఆంగోతు తండా, సేవాలాల్ తదితర తండాల్లో కూడా రాజేశ్వర్రెడ్డికే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసుకునే దిశగా పట్టభద్రులు ప్రయత్నం చేస్తున్నారు.