భోపాల్ : మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో విషాదం నెలకొంది. హోలీ పండుగ రోజున మద్యం షాపులు మూసేయడంతో.. ఓ ముగ్గురు వ్యక్తులు శానిటైజర్లో నీళ్లు కలుపుకొని సేవించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
హోలీ పండుగ రోజున రింకూ లోధి అనే వ్యక్తి.. మద్యం సేవించాలనుకున్నాడు. కానీ హోలీ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయించింది. దీంతో లోధి రెండు శానిటైజర్ బాటిళ్లను తీసుకొని తన బంధువులైన సంజు, అమిత్ వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి శానిటైజర్లో వాటర్ కలుపుకొని సేవించారు.
అదే రోజు రాత్రి లోధి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అమిత్ గ్వాలియర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సంజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
స్పుత్నిక్-వీ దరఖాస్తు నేడు ఎస్ఈఓ భేటీ
చరిత్రలో తొలి సాధారణ పౌరుల స్పేస్ఫ్లైట్.. సీట్లన్నీ ఫుల్
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ సీపీ నివాళి