కీవ్: ఉక్రెయిన్లో ఉన్న జపొరిజియా అణు ప్లాంట్ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఐఏఈఏ (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ) ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ వల్ల జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో రేడియేషన్ భయాందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ కాన్వాయ్లో యూఎన్ బృందం ఆ న్యూక్లియర్ ప్లాంట్కు చేరుకున్నది. ఆ ప్లాంట్ వద్ద రష్యా మిలిటరీ భారీ సంఖ్యలో మోహరించి ఉంది. ఉక్రెయిన్కు చెందిన న్యూక్లియర్ కంపెనీ ఎనర్జీగోటమ్ కూడా ఐఏఈఏ ఇన్స్పెక్టర్ల గురించి ప్రకటన చేసింది.