ముంబై: దక్షిణాఫ్రికాతో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్కు ఉమేశ్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షహబాజ్ అహ్మద్లను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు దీపక్ హుడాను పక్కన పెట్టారు. వెన్ను నొప్పితో అతను బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను ఎన్సీఏలో చికిత్స పొందుతున్నాడు. కండీషనింగ్ వర్క్కు సంబంధించి హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కూడా ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నారు. కోవిడ్19 నుంచి షమీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. షమీ స్థానంలో ఉమేశ్ను తీసుకున్నారు. హుడా స్థానంలో శ్రేయాస్ వచ్చాడు. షహబాజ్ను అదనంగా జట్టుకు జోడించారు.