ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చాలా మంది ధనవంతులు ఉక్రెయిన్ వీడి విదేశాల్లో తలదాచుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం స్వదేశంలోనే ఉండి అధికారులకు సాయం చేస్తున్నాడు. ఫోర్బ్స్ 100 మంది ఉక్రెయిన్ ధనవంతుల్లో 88వ స్థానంలో ఉన్న సెవోలోడ్ కోజెమ్యాకా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వ్యక్తి.
ఆగ్రోట్రేడ్ గ్రూప్ అనే కంపెనీకి సీఈవోగా ఉన్న కోజెమ్యాకా.. ఉక్రెయిన్ వదిలి వెళ్లలేదని, ఖర్కీవ్లోనే ఉండి అక్కడ రక్షణ దళాలకు సాయం చేస్తున్నారని పేర్కొంటూ కీవ్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ జబోరోనా మీడియా ఎడిటర్ కాటెరీనా సెర్గస్కోవా ట్వీట్ చేసింది.
అంతకుముందు తను వెళ్లిన టూర్లకు సంబంధించిన అందమైన సీనరీల ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న కోజెమ్యాకా.. ఇటీవలి కాలంలో రష్యా దాడుల్లో శిధిలమైన బిల్డింగుల ముందు ఫొటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటున్నాడు. అవి కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ukrainian businessman from the Forbes UA top100, Vsevolod Kozhemyaka, stays in his native Kharkiv city and helps local defenders and rescuers. Most of the businessmen of his level left Ukraine just before #RussianInvasion. pic.twitter.com/eST44Dn3S2
— katerina sergatskova (@KSergatskova) March 17, 2022