హైదరాబాద్: యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2021డిసెంబర్, 2022 జూన్ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్ను జారీచేసిన ఎన్టీఏ, ఇందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్కు సంబంధించి అడ్మిట్కార్డుల డౌన్లోడింగ్ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్సైట్లో వెల్లడించింది. దీంట్లో స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు http://http ://ugcnet.nta.ac.in వెట్సైట్ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.