మహబూబ్ నగర్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన కురుమూర్తిలో ఉద్దాల ఉత్సవం వైభవంగా జరిగింది. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలోని కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు.
ఉద్దాల కార్యక్రమంలో వరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధికారికంగా పాల్గొన్నారు. వడ్డేమాన్ గ్రామంలో తయారు చేసిన ఉద్దాలను (స్వామివారి పాదుకలు) ఊరేగింపుగా కురుమూర్తికి తరలించే కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు.