హైదరాబాద్, జూన్ 21: భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వేదిక ఉడాన్ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్ నాణ్యమైన, సరసమైన ధరలలోని ఆటా, మైదా, గోధుమలు, బియ్యం, శనగపిండి తదితర ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉడాన్లో లభించనున్నాయి. ‘‘కిరాణా స్టోర్లు నాణ్యమైన, సరసమైన ధరలలో ఉత్పత్తులను పొందలేకపోతున్నాయి.
ఫలితంగా స్థానిక రిటైలర్లు విక్రేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికి తోడు సరఫరాను అసరించి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు కెప్టెన్ హార్వెస్ట్ తగిన పరిష్కారం చూపగలదు. అత్యున్నత నాణ్యతకలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందిస్తుంది. అంతేకాదు, రైతులు, చిన్న మిల్లర్లు సైతం ఈ-కామర్స్ ప్రయోజనాలను పొందవచ్చు…’’ అని ఉడాన్ ఫుడ్ బిజినెస్ హెడ్ వివేక్ గుప్తా అన్నారు. ఈ బ్రాండ్ తొలుత 40 నగరాలు, పట్టణాలలో తనసేవలు అందించనున్నది.