సారపాక/భద్రాద్రి కొత్తగూడెం : పెంపుడు కుక్క స్నానం సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. పెంపుడు కుక్కకు స్నానం చేయించడం కోసం గోదావరి నదిలోకి వెళ్లగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఈ విషాదకర సంఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్ లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని రిక్షా కాలనీలో నివాసముంటున్న నిమ్మల వెంకటేశ్వరరావు కుమారుడు నిమ్మల హరిచంద్(25) తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు తన స్నేహితులైన తాళ్లగొమ్మూరులోని సత్యనారాయణ, నాగమణి దంపతుల రెండోకుమారుడు జమ్మి షణ్ముఖరావు(23), వడ్లమూడి వెంకటేశ్వరరావు కుమారుడు చక్రిలతో కలిసి.. మోతే పట్టీనగర్ లోని పుష్కరఘాట్ సమీపంలోని గోదావరి నదిలోకి దిగారు.
శునకానికి స్నానం చేస్తున్న క్రమంలో అది లోతైన ప్రాంతానికి వెళ్లడంతో దానిని కాపాడే ప్రయత్నంలో ఈత రాని హరిచంద్, షణ్ముఖరావులు గల్లంతయ్యారు. చక్రి కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకొని పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
గజ ఈతగాళ్లు పడవతో చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి వరకు గల్లంతైన ఇద్దరు వ్యక్తుల జాడ తెలియరాలేదు. ఇదిలా ఉండగా గల్లంతైన హరిచంద్ ఐటీసీ పీఎస్ పీడీలో షిఫ్ట్ ఇన్చార్జీగా పనిచేస్తుండగా, షణ్ముఖరావు పాల్వంచలోని బీటెక్ పూర్తిచేసి బీఫార్మసీ చదువుతున్నాడు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్