అమరావతి: పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముసునూరు మండలం లోపుడి గ్రామంలో రాజశేఖర్(19), రాంబాబు(20) అనే యువకులు పశువులను మేపేందుకు వెళ్లారు. సమీపంలోని తమ్మిలేరు కాలువలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి శవ పంచనామ జరిపి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.