సిద్దిపేట : జిల్లాలోని హుస్నాబాద్ శివారులో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతో బంధువులే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతులు హుస్నాబాద్ మండలం మడద వాసులుగా గుర్తింపు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.