హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎనిమిది స్పోర్ట్స్ బైకులను స్వాధీనం చేసుకొని, ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఏపీలోని గుంటూరుకు చెందిన చందు, శివ, నాగగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలూ చూస్తూ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. దొంగతనం చేసిన బైకులను గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.