అమరావతి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం పాలకాలువ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రెండు బైక్లో ఢీకొట్టుకోవడంతో సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో యువకుడు ఆసుప్రతికి తరలించగా మృతి చెందాడు. మృతులను జాగారంపల్లికి చెందిన రమేశ్, శేఖర్, పండు, రాజబాబుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి. చేతికందివచ్చిన కొడుకులను కోల్పోయిన కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.