అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు అనంత్నాగ్లో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు మరణించారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లోని బద్గామ్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నిరోజులుగా అతని మానసిక పరిస్థితి బాగాలేదని, దీంతో అతనికి ఎలాంటి ఆయుధాలు ఇవ్వలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అయితే ఇతరులు వారివారి పనుల్లో నిమగ్నమై ఉండగా, మరో సైనికుడి ఆయుధం తీసుకుని తనను తాను కాల్చకున్నాడని వెల్లడించారు. మృతిచెందిన సైనికుడు కేరళకు చెందినవాడని, సుదీర్ఘ సెలవుల అనంతరం గతవారమే విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు.