హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకున్నది. నానాజీపూర్ వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇవాళ ఉదయం సరదాగా ఇద్దరు ఈతకు వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయారు. మృతులను జూకల్కు చెందిన మహేందర్, నదీమ్గా గుర్తించారు. మృతుల్లో ఒకరి మృతి దేహం లభ్యమవగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.